మదనవిలసిత.
సురరిపుగణ సం
భరమును చిదుమన్
హరి రఘుపతియై
ధర పొడమెనయా
ఇది ఇంకొక చిట్టిపొట్టి వృత్తం.
దీనికి గణాలు న - న - గ అనేవి. అంటే పాదానికి 7 అక్షరాలే. ఆరులఘువుల మీద ఒక గురువు.
కేవలం 28 అక్షరాల్లో పద్యం సమాప్తం అవుతుంది.
వృత్తం కాబట్టి ప్రాస నియమం ఉంది. చిట్టిపాదాలు కాబట్టి యతిస్థానం ఏమీ లేదు.
పూర్వకవులు ఎవరన్నా ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.
నడక ప్రకారం చూస్తే ప్రతిపాదమూ కిటకిట - తకిటా అన్నట్లు వస్తుంది. పైన ఇచ్చిన పద్యాన్ని ఇలా విరుపుతో చూపవచ్చును.
సురరిపు - గణ సం
భరమును - చిదుమన్
హరిరఘు - పతియై
ధరపొడ - మెనయా
ఇలా మదనవిలసితం నడక చతురస్రగతిలో నడుస్తున్నది అన్నమాట. అంటే నాలుగు మాత్రల తరువాత విరుపు. కాబట్టి ఈవృత్తాన్ని న-న-గ అని మూడక్షరాల గణాలుగా చెప్పటం కన్నా
I I I I - I I U
అని గురులఘు క్రమంగా చెప్పటం బాగుంటుంది. లేదా
I I - I I - I I - U
అని చెప్పటం బాగుంటుంది.
ఆసక్తి కలవారు కొన్ని మదనవిలసితాలు వ్రాయటానికి పూనుకోండి.
అన్నట్లు ఈ మదనవిలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు.
అన్నట్లు ఈ మదనవిలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి