5, ఆగస్టు 2020, బుధవారం

మదనవిలసిత / మధుమతి

మదనవిలసిత.
సురరిపుగణ సం
భరమును చిదుమన్
హరి రఘుపతియై
ధర పొడమెనయా  
   

 

ఇది ఇంకొక చిట్టిపొట్టి వృత్తం.

దీనికి గణాలు  - న - గ అనేవి. అంటే పాదానికి 7 అక్షరాలే. ఆరులఘువుల మీద ఒక గురువు.
 కేవలం 28 అక్షరాల్లో పద్యం సమాప్తం అవుతుంది.
వృత్తం‌ కాబట్టి ప్రాస నియమం ఉంది. చిట్టిపాదాలు కాబట్టి యతిస్థానం ఏమీ లేదు.
పూర్వకవులు ఎవరన్నా ఈ వృత్తాన్ని వాడారా అన్నది తెలియదు.

నడక ప్రకారం చూస్తే ప్రతిపాదమూ  కిటకిట - తకిటా అన్నట్లు వస్తుంది. పైన ఇచ్చిన పద్యాన్ని ఇలా విరుపుతో చూపవచ్చును.

      సురరిపు  - గణ సం
      భరమును - చిదుమన్
      హరిరఘు - పతియై
      ధరపొడ  - మెనయా

ఇలా మదనవిలసితం నడచతురస్రగతిలో నడుస్తున్నది అన్నమాట.  అంటే నాలుగు మాత్రల తరువాత విరుపు. కాబట్టి ఈవృత్తాన్ని న-న-గ అని మూడక్షరాల గణాలుగా చెప్పటం‌ కన్నా

            I I I I - I I U

అని గురులఘు క్రమంగా చెప్పటం బాగుంటుంది. లేదా

           I I - I I - I I - U

అని చెప్పటం‌ బాగుంటుంది.

ఆసక్తి కలవారు కొన్ని  మదనవిలసితాలు వ్రాయటానికి పూనుకోండి.    

అన్నట్లు ఈ‌ విలసితాన్ని అనంతుడు అనే ఆయన తన ఛందోగ్రంథంలో 'మధుమతి' అన్నాడు. 
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి